దైవపరిపాలనా వార్తలు
గ్వాడెలోప్: మే నెలలో 6,830 మంది ప్రచారకులు, 9,302 బైబిలు పఠనములు క్రొత్త శిఖరాలుగా రిపోర్టుచేయబడినవి. నాలుగు ప్రాంతీయ సమావేశములు జరుగగా నాలుగింటికి కలిపి 12,407 మంది హాజరయ్యారు, 123 మంది బాప్తిస్మము తీసుకున్నారు.
రుమేనియా: ఏప్రిల్ మాసములో అక్కడ క్రొత్త శిఖరంగా 23,938 మంది ప్రచారకులు ఉన్నారు. గత సంవత్సరం సగటుపైన అచ్చట 17 శాతము అభివృద్ధి కలదు. జ్ఞాపకార్థదిన ఆచరణకు విశిష్టమైనరీతిలో 66,395 మంది హాజరయ్యారు.