క్షేత్రసేవా ముఖ్యాంశాలు
ఆగస్టు 2014
పరిపాలక సభ కోరుకున్నట్లే, ఆగస్టులో జరిగిన ప్రచార కార్యక్రమం ఇప్పటివరకు మన దేశంలో జరిగిన ప్రచార కార్యక్రమాలన్నిటిలోకి పెద్దది. 20,314 మంది ప్రచారకులు; 20,697 మంది క్రమ లేదా సహాయ పయినీర్లు; 299 మంది ప్రత్యేక పయినీర్లు అందరూ కలిసి ఆ నెల 1,03,86,681 కరపత్రాలు, బ్రోషుర్లు ఇచ్చారు. వార్షిక నివేదిక ప్రకారం, గత సేవా సంవత్సరంతో పోలిస్తే ఈసారి ప్రచారకుల సంఖ్య 7% పెరిగింది. ప్రచారకులు, పయినీర్ల మొత్తం సంఖ్య మొదటిసారి 41,310కి చేరుకుంది. ఈ పెద్ద దేశంలో, జరగాల్సిన పని ఇంకా ఎంతో ఉంది. కాబట్టి, “తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడి.”—మత్త. 9:38.