క్షేత్రసేవా ముఖ్యాంశాలు
మార్చి 2013
జ్ఞాపకార్థ ఆచరణ ప్రచార కార్యక్రమాన్ని యెహోవా మెండుగా ఆశీర్వదించాడు. ఈ గణాంకాలే దానికి రుజువు. ఈ సంవత్సరం ప్రభువు రాత్రి భోజన ఆచరణకు 1,08,467 మంది హాజరయ్యారు. మార్చి నెలలో మన పని వివిధ రంగాల్లో కొత్త రికార్డులు నమోదు చేసింది. 4,161 మంది క్రమ పయినీర్లతో కలిపి మొత్తం 37,248 మంది ప్రచారకులు 50,347 బైబిలు అధ్యయనాలు నిర్వహించారు.