దీన్ని బైబిలు ముందు చెప్పింది
● “సంభాషణ ఒక్కసారిగా కానీ ఆదరాబాదరాగా కానీ ప్రారంభమవ్వడం అన్నది ఎప్పుడూ జరగలేదు. ఎవరూ తమకున్న ప్రశ్నను, ఎంత ప్రాముఖ్యమైన ప్రశ్నైనా సరే, తొందరపడి అడిగేవారు కాదు, తక్షణం జవాబివ్వమని ఎవరినీ బలవంతంచేసేవారు కాదు. సంభాషణను ఆరంభించడానికి, సంభాషణను జరపడానికి నిజంగా మర్యాదతో కూడిన పద్ధతి ఏంటంటే ఆలోచించడానికి సమయాన్ని ఇస్తూ కొంచెం ఆగడమే. నిశ్శబ్దంగా ఉండటం లకోటా తెగవారికి అర్థవంతంగా ఉండేది . . . నిజమైన సభ్యతను ఆచరిస్తూ, ‘మాటకన్నా ముందు ఆలోచన వస్తుంది’ అన్న సూక్తికి గౌరవం ఇస్తూ కొంచెం సేపు [అలా] ఉండేవారు.—లూథర్ స్టాండింగ్ బేర్, ఓగ్లాలా సియెక్స్ తెగల పెద్ద (1868?-1939).
“నా ప్రియ సహోదరులారా, మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై యుండవలెను.”—యాకోబు 1:19, బైబిలు (సా.శ. మొదటి శతాబ్దం).
“సన్మార్గుల హృదయం ఎలా జవాబివ్వాలా అని ఆలోచిస్తుంది. దుర్మార్గుల నోరు చెడు మాటలు కుమ్మరిస్తుంది.”—సామెతలు 15:28, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం; బైబిలు (సా.శ.పూ. దాదాపు ఎనిమిదవ శతాబ్దం).
“బుద్ధిహీనుడు తన కోపమంత కనుపరచును జ్ఞానముగలవాడు కోపము అణచుకొని దానిని చూపకుండును.”—సామెతలు 29:11, బైబిలు (సా.శ.పూ. దాదాపు ఎనిమిదవ శతాబ్దం).
[27వ పేజీలోని చిత్రసౌజన్యం]
Photo by David Barry, the Denver Public Library, Western History Collection