దేవుని వాక్యంలో ఉన్న సంపద | యోహాను 7-8
యేసు తన తండ్రిని మహిమపర్చాడు
యేసు ఏం మాట్లాడినా, ఏం చేసినా వాటన్నిటిలో తన పరలోక తండ్రినే మహిమపర్చాడు. తాను చెప్పే సందేశం దేవుని దగ్గర నుండి వచ్చిందని ప్రజలు తెలుసుకోవాలని యేసు కోరుకున్నాడు. అందుకే ఆయన లేఖనాల ఆధారంగా బోధించాడు, తరచు వాటి నుండే ఎత్తి చెప్పాడు. ఆయన్ని పొగిడినప్పుడు, యేసు ఆ గొప్పతనం తనకు కాకుండా యెహోవాకు చెందేలా చూశాడు. యెహోవా తనకు అప్పగించిన పనిని పూర్తి చేయడంపైనే ప్రధానంగా ఆయన దృష్టి పెట్టాడు.—యోహా 17:4.
ఇలాంటి సందర్భాల్లో మనమెలా యేసును అనుకరించవచ్చు . . .
బైబిలు అధ్యయనం నిర్వహిస్తున్నప్పుడు లేదా స్టేజీ మీద నుండి ప్రసంగిస్తున్నప్పుడు?
ఇతరులు పొగిడినప్పుడు?
మన సమయాన్ని ఎలా గడపాలో నిర్ణయించుకుంటున్నప్పుడు?