దేవుని వాక్యంలో ఉన్న సంపద | యోబు 6-10
యథార్థవంతుడైన యోబు తన బాధను వ్యక్తం చేశాడు
యోబుకు ఆస్తంతా పోయింది, పిల్లలందరూ చనిపోయారు, భయంకరమైన రోగంతో బాధపడుతున్నాడు, అయినా యథార్థంగా ఉన్నాడు. కాబట్టి సాతాను నిరుత్సాహాన్ని ఉపయోగించి అతని యథార్థతను దెబ్బతీయాలని చూశాడు. అతని ముగ్గురు కపట స్నేహితులు వచ్చారు. మొదట వాళ్లు సానుభూతి ఉన్నట్లు చూపించారు. ఏడు రోజులు యోబు పక్కన నిశ్శబ్దంగా కూర్చున్నారు, ఓదార్చే మాట ఒక్కటి కూడా చెప్పలేదు. తర్వాత మాత్రం అతని మీద చాలా తప్పులు మోపారు, కఠినంగా నిందించారు.
యోబుకు ఎన్ని కష్టాలు వచ్చినా యెహోవాకు యథార్థంగా ఉన్నాడు
తీవ్రమైన బాధ వల్ల యోబు తప్పుగా ఆలోచించాడు. ఆయన నమ్మకంగా ఉన్నా దేవుడు పట్టించుకోవడం లేదని అనుకున్నాడు
నిరుత్సాహం వల్ల యోబు తన బాధలకు వేరే ఏ కారణాలు ఉన్నాయో ఆలోచించలేకపోయాడు
యోబు ఎంత బాధలో ఉన్నా, యెహోవా మీద తనకున్న ప్రేమ గురించి అతన్ని నిందించే వాళ్లతో చెప్పాడు