దొంగలను శిక్షించే చెట్లు
కొన్ని దేశాల్లో కిస్మస్ పండుగనాచరించుటకు క్రిస్మస్ చెట్టు తప్పనిసరి అంటారు. గానీ చెట్టు కావలసినవారంతా ఒకదాన్ని కొనాలని ఇష్టపడుటలేదు. అమెరికాలో, అనేక జాతీయ రహదారుల ప్రక్కనున్న ఉద్యానవనాల్లోని, చెట్లు దొంగలపాలౌతున్నవి. జాజి, దేవదారు, మొదలగు చెట్లకొరకు దొంగలు ఆటపొలం ఎవరిదైనా కానివ్వండి అందులోపడి వాటిని నరికి, ఈడ్చుకొని వెళ్తారు.
కొన్నిరాష్ట్రాలు దీన్ని అరికట్టాలని నడుంకట్టినవి. గత సంవత్సరం క్రిస్మస్ సమయములో ఉత్తరప్రాంతములోని అధికారులు ఒక ప్రత్యేక రసాయన పదార్థాన్ని చెట్ల మీద చల్లుటకారంభించారు. శీతలంగావున్న ఆరుబయట దాని వాసన రాదు గానీ చెట్టు క్షేమంగా ఒకసారి ఇంట్లోచేరి దొంగవున్న వెచ్చని గదిలో వుంటే అప్పుడు ఆ రసాయనం దాని వాసన వెదజల్లుతుంది. ద వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం అది “క్రిమిసంహారక మందుల కర్మాగారము” వంటి దుర్వాసన కొటుతుంది.
కనెక్టికట్లోని మోన్రో యొక్క ఉద్యానవనముల డైరెక్టరు తెలుపునదేమనగా, కొన్ని సంవత్సరముల నుండి వందలాది చెట్లు దొంగలపాలయినవి. అయితే అధికారులు వార్తా పత్రికలద్వారా కాబోయే దొంగలను హెచ్చరిస్తూ, అందమైన చెట్లు కంపు కొడతాయి అని ప్రకటించగా దొంగల బెడద తగ్గుముఖం పట్టింది. (g90 12/22)