భాగం 7
యేసుక్రీస్తు ఎవరు?
యెహోవా యేసును భూమ్మీదికి పంపించాడు. 1 యోహాను 4:9
మనం యెహోవాను సంతోషపెట్టాలంటే, ఆయన కుమారుడు చెప్పేది కూడా వినాలి. ఆదామును సృష్టించడానికి చాలాకాలం ముందే యెహోవా పరలోకంలో ఒక బలమైన దేవదూతను సృష్టించాడు.
తర్వాత యెహోవా ఆయన్ని ఒక మనిషిగా భూమ్మీదికి పంపించాడు, ఆయన బేత్లెహేములో మరియ అనే కన్యకు పుట్టాడు. ఆ బిడ్డకు యేసు అని పేరు పెట్టారు.—యోహాను 6:38.
యేసు భూమ్మీద ఉన్నప్పుడు దేవుని లక్షణాలు పూర్తిగా చూపించాడు. ఆయన దయగా, ప్రేమగా ఉండేవాడు, ప్రజలు ఆయన దగ్గరికి వెళ్లడానికి ఇష్టపడేవాళ్లు. ఆయన యెహోవా గురించిన సత్యాన్ని ధైర్యంగా బోధించాడు.
యేసు మంచి చేశాడు, కానీ చాలామంది ఆయన్ని ఇష్టపడలేదు. 1 పేతురు 2:21-24
అంతేకాదు యేసు రోగుల్ని బాగుచేశాడు, చనిపోయినవాళ్లను బ్రతికించాడు.
యేసు మతనాయకుల అబద్ధ బోధల్ని, చెడుతనాన్ని బయటపెట్టేవాడు కాబట్టి వాళ్లకు ఆయనంటే కోపం.
మతనాయకులు యేసు గురించి అబద్ధాలు చెప్పి రోమన్ల చేత ఆయన్ని కొట్టించి, చంపించారు.