దేవుని వాక్యంలో ఉన్న సంపద | కీర్తనలు 79-86
మీ జీవితంలో అత్యంత ముఖ్యమైనవాళ్లు ఎవరు?
83వ కీర్తనను ఆసాపు వంశస్థుడైన లేవీయుడు రాసి ఉంటాడు. ఇతను రాజైన దావీదుకు సమకాలీనుడు కావచ్చు. యెహోవా ప్రజలపై శత్రు సైన్యాల అపాయం పొంచి ఉన్న సమయంలో ఈ కీర్తనను రాసి ఉండవచ్చు.
ఈ కీర్తనకర్త ప్రార్థనలో, తన ప్రాణం గురించి కాకుండా యెహోవా పేరు గురించి, ఆయన సర్వాధిపత్యం గురించి చెప్పాడు
ఈ రోజుల్లో దేవుని ప్రజలు, ఒకదాని తర్వాత ఒకటిగా దాడులను ఎదుర్కొంటూనే ఉన్నారు. కానీ నమ్మకంగా ఉండి సహించడం ద్వారా యెహోవాకు ఘనతను తీసుకొస్తాం
మనం తన పేరును తెలుసుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు
మన జీవితంలో యెహోవాయే ముఖ్యమని మన పనుల ద్వారా చూపించాలి