కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 2/15 పేజీలు 5-7
  • దౌర్జన్యం శాశ్వతంగా అంతమవ్వడం—ఎలా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దౌర్జన్యం శాశ్వతంగా అంతమవ్వడం—ఎలా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఏమి చేయవచ్చు?
  • దేవుని వాక్యం యొక్క శక్తి
  • దౌర్జన్యాన్ని అంతమొందించే ప్రచారం
  • ఒక ప్రాముఖ్యమైన గుణపాఠం
  • హింస లేని ప్రపంచం వస్తుందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2016
  • హింస
    తేజరిల్లు!—2015
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • మనం అప్రమత్తంగా ఉండడం ఇప్పుడు మరింత అత్యవసరం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 2/15 పేజీలు 5-7

దౌర్జన్యం శాశ్వతంగా అంతమవ్వడం—ఎలా?

తుపాకీలను తిరిగి ఇస్తే వాటికి మారుగా డబ్బు లేదా వస్తువులు, ప్రశ్నలు అడుగబడవు—ఇలాంటి క్రొత్త తరహా తలంపుతో దౌర్జన్యం యొక్క పెరుగుదలను అరికట్టాలని అమెరికాలోని అనేక నగరాలు ప్రయోగం చేశాయి. ఫలితం? ఉదాహరణకు, సెయింట్‌ లూయిస్‌ నగరం 3,41,000 అమెరికన్‌ డాలర్ల ఖర్చుతో 8,500 తుపాకీలను సేకరించింది. అలాంటి ఒక కార్యక్రమంలో న్యూయార్క్‌ నగరం వెయ్యి కంటే ఎక్కువ ఆయుధాలను సంపాదించింది.

ఇవన్నీ నేరంపై ఎలాంటి ప్రభావాన్ని చూపాయి? అతి తక్కువ ప్రభావాన్ని చూపాయనడం దుఃఖకరం. సెయింట్‌ లూయిస్‌లో ఆ తర్వాతి సంవత్సరం తుపాకీ సంబంధిత హత్యలు గతంకన్నా శిఖరాగ్ర స్థాయిని చేరాయి. న్యూయార్క్‌ నగరంలో, ఇప్పటికీ సాధారణ ప్రజలవద్ద 20 లక్షల తుపాకీలున్నట్లు అంచనా వేయబడింది. అమెరికాలో, ప్రజలవద్ద ఇంచుమించు 20 కోట్ల తుపాకీలు ఉన్నాయి అంటే, దాదాపు ప్రతి పురుషునికి స్త్రీకి బాలునికి ఒకటి చొప్పున తమ స్వంత తుపాకీలు ఉన్నాయి. ఇతర దేశాల్లో, తుపాకీ సంబంధిత దౌర్జన్యం భయం గొల్పే రీతిలో పెరుగుతోంది. బ్రిటన్‌లో, “1983 మరియు 1993 మధ్య కాలంలో ప్రేలుడు ఆయుధాలను ఉపయోగించిన నేరాలుగా పోలీసులు రికార్డు చేసినవాటి సంఖ్య 14,000 అయ్యిందని అంటే దాదాపు రెండింతలయ్యిందని” ది ఎకానమిస్ట్‌ చెబుతుంది. హత్యల రేటు పోల్చి చూస్తే తక్కువగానే ఉన్నప్పటికీ, ఆ దేశంలో దాదాపు పది లక్షల చట్టవిరుద్ధమైన ఆయుధాలు ఉన్నాయి.

కచ్చితంగా, భయం గొల్పే ఆ సంఖ్యల్లో ఏమాత్రం తగ్గుదల ఉన్నా ఒక అడుగు ముందుకు వేసినట్లే. అయితే, పైన వివరించినలాంటి చర్యలు దౌర్జన్యం యొక్క మూలకారకాల వరకు చేరలేవు. ఆ మూలకారకాలేమిటి? అనేక కారణాలు సూచించబడ్డాయి కాని వాటిలో కొన్ని మాత్రం ప్రాథమికమైనవి. కుటుంబ అస్థిరత మరియు నైతిక ఉపదేశ కొరత అనేకమంది యౌవనస్థులు ఏదొక దానికి చెందాలన్న భావనతో అల్లరిగుంపుల్లో చేరిపోవడానికి కారణమైంది. ఎక్కువ లాభాలను పొందవచ్చుననే ఆశ అనేకులను దౌర్జన్యానికి తిరగడానికి ప్రేరేపిస్తాయి. దౌర్జన్యం ద్వారా పరిస్థితులను చక్కబెట్టాలని ప్రయత్నించడానికి అన్యాయం మరితరులను ప్రేరేపిస్తుంది. దేశగౌరవం, జాతి, లేక జీవితంలోని స్థితి ప్రజలు ఇతరుల బాధలను అలక్ష్యం చేసేలా చేస్తాయి. అవి లోతుగా వ్రేళ్లూనిన కారణాలు, వీటికి సులభమైన పరిష్కారాలు లేవు.

ఏమి చేయవచ్చు?

అధిక పోలీసు బలగం, కఠిన కారాగార శిక్షలు, తుపాకీ కొనుగోలుపై నిర్బంధాలు, మరణ శిక్ష—ఇవన్నీ కూడా నేరాన్ని దౌర్జన్యాన్ని నిర్మూలించడానికి మార్గాలుగా ప్రతిపాదించబడ్డాయి మరియు ప్రయత్నించబడ్డాయి. అవి కొంచెం అటుఇటుగా సాఫల్యాన్ని తెచ్చాయి, కాని దుఃఖకరమైన వాస్తవమేమిటంటే దౌర్జన్యం ఇప్పటికీ మన జీవితంలో ఒక భాగమైవుంది. ఎందుకు? ఎందుకంటే ఈ చర్యలు కేవలం సూచనలను మాత్రమే బాగుచేయగలవు.

మరో వైపున, దౌర్జన్యాన్ని నిర్మూలించడానికి మరో కీలకం విద్యాభ్యాసమని అనేకమంది నిపుణులు భావిస్తున్నారు. ఈ తలంపు సరైనదే అయినప్పటికీ, విద్యా సంబంధ అవకాశాలు తక్కువగా ఉన్న దేశాలకు మాత్రమే దౌర్జన్యం పరిమితమైలేదని మనం గమనించాలి. వాస్తవానికి, అత్యంత దౌర్జన్యపూరిత దేశాలలో కొన్ని అత్యున్నత విద్యా ప్రమాణాలుగల దేశాలు కూడా ఉన్నట్లు కనిపిస్తుంది. అవసరమైనది కేవలం విద్యనే కాదు గాని సరైన విద్య అని గ్రహించడం కష్టమేమీకాదు. అది ఏ విధమైనది కావచ్చు? శాంతికాముకులుగా, నీతిగల వ్యక్తులుగా ఉండడానికి ప్రజలకు బోధించగలవారెవరైనా ఉన్నారా?

“నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించినయెడల నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్రతరంగములవలెను ఉండును.” (ఇటాలిక్కులు మావి, యెషయా 48:17, 18) శాంతికాముకులుగా, నీతిమంతులుగా ఉండడానికి యెహోవా దేవుడు ప్రజలకు ఎలా బోధిస్తాడు? ప్రాథమికంగా ఆయన వాక్యమైన బైబిలు ద్వారానే.

దేవుని వాక్యం యొక్క శక్తి

బైబిలు కేవలం పాత కట్టుకథలు మరియు ఆచరణలోలేని, సందర్భోచితంకాని సామెతల సమీకరణ ఎంతమాత్రం కాదు. దానిలో మానవజాతి యొక్క సృష్టికర్త ఇచ్చిన సూత్రాలు తలంపులు ఉన్నాయి. ఆయన తన అత్యున్నత దృక్కోణం నుండి చూస్తాడు గనుక, ఆయనకు మానవ నైజం గురించి మరెవరికన్నా కూడా బాగా తెలుసు. యెహోవా దేవుడు ఇలా చెబుతున్నాడు: “ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గములకంటె నా మార్గములు మీ తలంపులకంటె నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి.”—యెషయా 55:9.

ఈ కారణం చేతనే అపొస్తలుడైన పౌలు ఇలా సాక్ష్యమిస్తున్నాడు: “దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.” (హెబ్రీయులు 4:12) అవును, ఒక వ్యక్తి హృదయాన్ని తాకి ఆయన ఆలోచనా విధానాన్ని ప్రవర్తనను మార్చే శక్తి దేవుని వాక్యానికి ఉంది. నేడు ప్రజల దౌర్జన్యపూరితమైన మార్గాలను మార్చడానికి అవసరమైనది ఇదే కాదంటారా?

ఇప్పుడు 230 కంటే ఎక్కువ దేశాల్లో దాదాపు 50 లక్షల మంది వరకున్న యెహోవాసాక్షులు, వాస్తవానికి జీవితాలను మంచిగా మార్చే శక్తి దేవుని వాక్యానికి ఉందనడానికి సజీవ సాక్ష్యంగా ఉన్నారు. వారిలో ప్రతి జాతి, భాష మరియు తెగ నుండి వచ్చిన ప్రజలున్నారు. వారు అన్ని విధాలైన సామాజిక ఆర్థిక స్థితిగతుల నుండి మరియు సాంఘిక పూర్వాపరాల నుండి కూడా వచ్చారు. వారిలో కొందరు గతంలో దౌర్జన్యపూరితమైన, కష్టాలతో కూడిన జీవితాలను గడిపారు. కాని అలాంటి కారణాలు తమ మధ్య శత్రుత్వాన్ని, విరోధాన్ని, వివక్షతను, ద్వేషాన్ని వృద్ధి చేయడానికి అనుమతించే బదులు, వారు ఈ అడ్డంకులను అధిగమించడానికి నేర్చుకొని ప్రపంచవ్యాప్తంగా శాంతికాముకులుగా ఐక్య ప్రజలుగా తయారయ్యారు. ఏది దీన్ని సాధ్యపర్చింది?

దౌర్జన్యాన్ని అంతమొందించే ప్రచారం

దేవుని వాక్యమైన బైబిలునందు బయల్పర్చబడినట్లుగా ఆయన సంకల్పాన్ని గూర్చిన కచ్చితమైన జ్ఞానాన్ని పొందేందుకు ఇతరులకు సహాయం చేయవలసిన బాధ్యత యెహోవాసాక్షులకు ఉంది. యెహోవా మార్గాల గురించి తెలుసుకొని ఆయనచే బోధింపబడాలని కోరుకుంటున్న వారికొరకు వారు భూమి నలుమూలల గాలిస్తున్నారు. వారి ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఈ విద్యా సంబంధిత ప్రచారం ఫలితంగా ఒక అద్భుతమైన ప్రవచనం నెరవేరుతోంది.

సుమారు 2,700 సంవత్సరాల క్రితం, ప్రవక్తయైన యెషయా ఇలా వ్రాయడానికి ప్రేరేపించబడ్డాడు: “అంత్యదినములలో . . . జనములు గుంపులు గుంపులుగా వచ్చి—యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు.”—యెషయా 2:2, 3.

యెహోవాచే బోధింపబడి, ఆయన త్రోవలలో నడవడం ప్రజల జీవితాల్లో అద్భుతమైన మార్పులను తీసుకురాగలదు. ఆ మార్పుల్లో ఒకటి అదే ప్రవచనంలో ఇలా చెప్పబడింది: “వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును. యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.” (యెషయా 2:4) అనేకులు ఈ లేఖనాన్ని చదివారు. వాస్తవానికి, న్యూయార్క్‌ నగరంలోని ఐక్యరాజ్య సమితి భవన సముదాయపు గోడపై ఈ లేఖనం చెక్కబడింది. అది ఐక్యరాజ్య సమితి అభిలషిస్తున్నదానికి, కాని సాధించడంలో విఫలమైనదానికి జ్ఞాపికగా ఉంది. ఏ మానవ నిర్మిత రాజకీయ సంస్థ యుద్ధాన్ని దౌర్జన్యాన్ని నిర్మూలించలేదు. దానిని చేయగల సామర్థ్యం కేవలం యెహోవా దేవునికి మాత్రమే ఉంది. ఆయన దాన్ని ఎలా సాధిస్తాడు?

స్పష్టంగా, “యెహోవా పర్వతమునకు” వెళ్లి ‘ఆయన మార్గాల గురించి ఉపదేశించబడి,’ ‘ఆయన త్రోవలలో నడవమనే’ ఆహ్వానానికి ప్రతి ఒక్కరూ ప్రతిస్పందించరు, అంతేగాక ‘తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుకోవడానికి’ అందరూ ఇష్టపడరు. అలాంటి వారి గురించి యెహోవా ఏమి చేస్తాడు? ఆయన అవకాశమనే తలుపును నిరంతరం తెరిచివుంచడు లేక వారు మారాలని వేచివుండడు. దౌర్జన్యాన్ని అంతమొందించేందుకు, తమ దౌర్జన్యపూరిత మార్గాలను విడనాడని వారిని కూడా యెహోవా అంతమొందిస్తాడు.

ఒక ప్రాముఖ్యమైన గుణపాఠం

నోవహు కాలంలో దేవుడు చేసినది నేడు మనకొక హెచ్చరికా గుణపాఠాన్ని అందజేస్తుంది. అప్పుడు ఏ విధమైన లోకం ఉండేదో బైబిలు వృత్తాంతం ఇలా చూపిస్తుంది: “భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను; భూలోకము బలాత్కారముతో [“దౌర్జన్యముతో,” NW] నిండియుండెను.” ఈ విషయంలో, దేవుడు నోవహుకు ఇలా తెలియజేశాడు: “సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో [“దౌర్జన్యముతో,” NW] నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది; ఇదిగో వారిని భూమితోకూడ నాశనము చేయుదును.”—ఆదికాండము 6:11, 13.

మనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఆ తరంపైకి జలప్రళయం తెచ్చేటప్పుడు, దేవుడు నోవహును ఆయన కుటుంబాన్ని కాపాడాడు. ఎందుకు? బైబిలు ఇలా సమాధానమిస్తుంది: “నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై యుండెను. నోవహు దేవునితోకూడ నడచినవాడు.” (ఆదికాండము 6:9; 7:1) ఆ కాలంలో జీవిస్తుండిన ప్రతి ఒక్కరూ దౌర్జన్యపూరితమైన వ్యక్తులే కాకపోయినప్పటికీ నోవహు మరియు ఆయన కుటుంబం మాత్రమే “దేవునితోకూడ నడచి”రి. అందుకే, దౌర్జన్యపూరితమైన ఆ లోకం నిర్మూలించబడినప్పుడు వారు తప్పించబడ్డారు.

భూమి మరోసారి “బలాత్కారముతో [“దౌర్జన్యముతో,” NW] నిండి” పోతుండడాన్ని మనం చూస్తున్నాం గనుక దేవుడు దాన్ని గమనించకుండా ఉండడని మనం నిశ్చయత కలిగివుండవచ్చు. ఆయన నోవహు కాలంలో చేసినట్లే, త్వరలోనే ఆయన చర్య గైకొని దౌర్జన్యాన్ని శాశ్వతంగా అంతమొందిస్తాడు. కాని ఇప్పుడు ‘దేవునితో నడవడానికి’ నేర్చుకుంటున్నవారు, శాంతి కొరకైన తన గొప్ప విద్యా సంబంధ ప్రచారానికి ప్రతిస్పందిస్తున్నవారు సురక్షితంగా ఉండడానికి ఆయన ఒక మార్గాన్ని కూడా తెరుస్తాడు.

కీర్తనల రచయిత ద్వారా, యెహోవా ఈ అభయాన్నిస్తున్నాడు: “ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు. వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహు క్షేమము కలిగి సుఖించెదరు.”—కీర్తన 37:10, 11.

“యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము” అని చెప్పేవారితో మీరు కలవగలిగేలా, మీతో బైబిలును పఠించడానికి యెహోవాసాక్షులు సంతోషిస్తారు. (యెషయా 2:3) అలా చేయడం ద్వారా, సమస్త దుష్టత్వం మరియు దౌర్జన్యం యొక్క అంతాన్ని చూసేవారిలో మీరు కూడా చేరివుండవచ్చు. మీరు “బహు క్షేమము కలిగి సుఖించ”వచ్చు.

[5వ పేజీలోని చిత్రసౌజన్యం]

Reuters/Bettmann

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి