దేవుని వాక్యంలో ఉన్న సంపద | నిర్గమకాండం 25-26
గుడారంలో ఉన్న అత్యంత ప్రాముఖ్యమైన వస్తువు
ఒప్పంద మందసం ప్రత్యక్ష గుడారానికి, ఇశ్రాయేలీయులకు సంబంధించిన అత్యంత ప్రాముఖ్యమైన వస్తువు. ప్రాయశ్చిత్త మూత మీద రెండు కెరూబుల మధ్య ఉన్న మేఘం దేవుని ప్రత్యక్షతకు సూచనగా ఉండేది. ప్రతీ సంవత్సరం ప్రాయశ్చిత్త రోజున ప్రధాన యాజకుడు అతి పవిత్ర స్థలంలోకి ప్రవేశించి, ఇశ్రాయేలీయుల పాపాలకు ప్రాయశ్చిత్తంగా కోడెదూడ రక్తాన్ని, మేక రక్తాన్ని ఆ మూత ముందు చిమ్మేవాడు. (లేవీ 16:14, 15) భవిష్యత్తులో గొప్ప ప్రధాన యాజకుడైన యేసు తన విమోచనా క్రయధన బలి విలువను యెహోవా ముందు ఉంచేలా పరలోకంలో అడుగుపెట్టడాన్ని అది సూచించింది.
విమోచనా క్రయధనం వల్ల మనం పొందే ప్రయోజనాల్ని, ఈ లేఖనాలతో జత చేయండి.
లేఖనాలు
ప్రయోజనాలు
శాశ్వతంగా జీవించే నిరీక్షణ
పాపక్షమాపణ
శుద్ధమైన మనస్సాక్షి
మనం ఈ ప్రయోజనాలు పొందాలంటే ఏం చేయాలి?