దైవపరిపాలనా వార్తలు
ఇండియా: రెండు సంవత్సరాల్లో పుస్తకాలు, పత్రికలను అందించడంలో మొదటి శిఖరాగ్ర సంఖ్య, మూడు సంవత్సరాల్లో పత్రికల చందాల మొదటి శిఖరాగ్ర సంఖ్యలతో సహా ప్రతి రంగంలోను శిఖరాగ్రాలను చేరుకుంటూ, ఏప్రిల్ నెలలో మన పని చాలా బాగా జరిగింది. పదిహేను నెలల్లోని మొత్తం ప్రచారకులు 12వ సారి శిఖరాగ్ర సంఖ్యను (14,194) చేరుకోడమే కాకుండా, ముందెన్నటికన్నా క్రమ పయినీర్ల సంఖ్య (818), జరిపిన పునర్దర్శనాల సంఖ్య (79,871), నిర్వహించిన బైబిలు పఠనాల సంఖ్య (12,963) ఎన్నడూ లేని కొత్త శిఖరాగ్రాన్ని చేరుకున్నాయి.
మామూలుగానే, సహాయ పయినీర్ల సాంవత్సరిక శిఖరాగ్ర సంఖ్య ఏప్రిల్లో (1,801)—గత సంవత్సరం కన్నా 40 శాతం ఎక్కువగా ఉంది! పరిచర్యలో 3,33,489 గంటలు గడిపాము, అంటే అది గత సంవత్సరపు శిఖరాగ్రానికన్నా 18 శాతం అభివృద్ధి. పత్రికలు, పుస్తకాల అందింపు 12 మరియు 10 శాతం వరకు, వరుసగా 1,33,292 మరియు 7,838కి పెరిగింది; గత సంవత్సరం కన్నా 26 శాతం ఎక్కువ శిఖరాగ్ర సంఖ్యగా 3,235 చందాలు సేకరించబడ్డాయి, దీనికంటే ముందు ఫిబ్రవరిలో చేరుకున్న శిఖరాగ్రం కన్నా ఆశ్చర్యకరంగా 97 శాతం పెరుగుదలతో యీ నెలలో 71,998 చిన్న పుస్తకాలు అందించబడ్డాయి!
ఈ 1994లో మన జ్ఞాపకార్థ దిన హాజరు 38,192, అందులో నలుగురు వ్యక్తులు పాలు పంచుకున్నారు. ఇది గత సంవత్సరపు హాజరు కన్నా 9.2 శాతం పెరుగుదలను, ప్రతి సంఘంలోను 79 శాతం సగటు హాజరును సూచిస్తుంది.