లోకాన్ని దేవుడు పరిపాలిస్తున్నాడా?
అది ఆదివారం ఉదయం. అనేకమంది ప్రజలు మంచందిగి, బట్టలు వేసుకొని, టిఫిన్ తిని గబగబా చర్చికి వెళతారు. అక్కడ వాళ్లు దేవుడు అసాధారణ అధికారంతో భూమిపై సర్వోన్నతంగా పరిపాలించడాన్ని గూర్చిన ప్రసంగం విన్నారు. ప్రజలయెడల ఆయనకెంతో శ్రద్ధ ఉందని వాళ్లకు తెల్పబడింది. యేసుక్రీస్తు కూడ ప్రస్తావనకు వచ్చాడు. ఆయన రాజులకు రాజని విధేయతతో ప్రతిమోకాలు ఆయనయెదుట వంగునని చెప్పడమూ వాళ్లక్కడ విన్నారు.
చర్చినుండి ఇంటికి తిరిగివచ్చిన తర్వాత, ఆ ప్రజలు దూరదర్శిని పెట్టుకుని వార్తలు చూశారు. ఇప్పుడు వాళ్లు కరువు, నేరం, మాదక ద్రవ్యాల దుర్వినియోగం, దారిద్ర్యంవంటి వాటినిగూర్చి వింటారు. ఆలాగే వాళ్లు రోగం మరణాలకు సంబంధించిన హృదయవిదారకమైన దృశ్యాలు చూస్తారు.
చర్చిలో విన్నవాటిని గూర్చి, అక్కడెన్నడూ వివరించబడనివాటిని గూర్చి వాళ్లు ప్రత్యేకంగా ఆలోచించడం ఆరంభిస్తారు. దేవుడు ప్రేమగలవాడూ సర్వశక్తిమంతుడూ అయినట్లయితే, భయంకరమైనవి ఎందుకు సంభవిస్తాయి? మరి యేసుక్రీస్తు విషయమేమి? స్పష్టముగా, ఆయనకు విధేయతచూపుతూ వంగని మోకాళ్లెన్నో ఉన్నాయి.
[3వ పేజీలోని చిత్రం]
లోకాన్ని దేవుడే పరిపాలిస్తుంటే, బాధ సంక్షోభం ఎందుకున్నాయి?
[2వ పేజీలోని చిత్రసౌజన్యం]
Cover: NASA photo