కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lfb పాఠం 102 పేజీ 236-పేజీ 237 పేరా 2
  • యోహానుకు వచ్చిన దర్శనాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యోహానుకు వచ్చిన దర్శనాలు
  • నా బైబిలు పుస్తకం
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా పరలోక సింహాసనపు మహిమా ప్రభావము
    ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
  • విజయోత్సాహపు క్రొత్త కీర్తన పాడుట
    ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
  • యోహాను మహిమనొందిన యేసును చూచుట
    ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
  • దేవుని రాజ్యం అంటే ఏమిటి?
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
మరిన్ని
నా బైబిలు పుస్తకం
lfb పాఠం 102 పేజీ 236-పేజీ 237 పేరా 2
అపొస్తలుడైన యోహాను ప్రకటన పుస్తకం రాస్తున్నాడు

లెసన్‌ 102

యోహానుకు వచ్చిన దర్శనాలు

అపొస్తలుడైన యోహాను పత్మాసు ద్వీపంలో ఖైదీగా ఉన్నప్పుడు, యేసు ఆయనకు భవిష్యత్తు గురించి వరుసగా 16 దర్శనాలు లేదా బొమ్మలు చూపించాడు. ఈ దర్శనాలు యెహోవా పేరు ఎలా పవిత్రపర్చబడుతుందో, ఆయన రాజ్యం ఎలా వస్తుందో, ఆయన ఇష్టం పరలోకంలో నెరవేరుతున్నట్లు భూమ్మీద ఎలా నెరవేరుతుందో చూపించాయి.

యోహాను ఒక దర్శనంలో, పరలోకంలో తన మహిమగల సింహాసనంపై కూర్చున్న యెహోవాను చూస్తాడు. అతని చుట్టూ 24 మంది పెద్దలు తెల్ల బట్టలు వేసుకుని ఉన్నారు, వాళ్ల తలలపై బంగారు కిరీటాలు ఉన్నాయి. సింహాసనం నుండి పెద్దపెద్ద మెరుపులు, గొప్ప ఉరుముల శబ్దాలు వస్తున్నాయి. 24 మంది పెద్దలు యెహోవా ముందు సాగిలపడి ఆయనను ఆరాధించారు. ఇంకో దర్శనంలో, యెహోవాను ఆరాధించే ఒక గొప్ప జనాన్ని యోహాను చూస్తాడు. వాళ్లు అన్ని దేశాలు, ప్రజలు, భాషల నుండి వచ్చినవాళ్లు. గొర్రెపిల్ల అంటే యేసు వాళ్లను కాస్తూ, జీవాన్ని ఇచ్చే నీళ్ల దగ్గరికి తీసుకెళ్తాడు. తర్వాత ఇంకో దర్శనంలో యేసు 24 మంది పెద్దలతో పరలోకంలో రాజుగా పరిపాలించడం మొదలుపెడతాడు. ఆ తర్వాత వచ్చిన దర్శనంలో యేసు మహాసర్పమైన సాతానుతో, అతనితో ఉన్న చెడ్డదూతలతో పోరాడుతున్నట్లు యోహాను చూశాడు. యేసు వాళ్లను పరలోకం నుండి బయటికి భూమి మీదకు పడేస్తాడు.

యేసు, 1,44,000 మంది సీయోను కొండ మీద ఉన్నారు

అప్పుడు గొర్రెపిల్ల, 1,44,000 మంది సీయోను కొండ మీద నిలబడి ఉన్న అందమైన దృశ్యాన్ని యోహాను చూశాడు. భూమి చుట్టూ ఒక దేవదూత ఎగురుతూ దేవునికి భయపడమని, ఆయనను మహిమపర్చమని చెప్పడం కూడా యోహాను చూశాడు.

తర్వాత దర్శనంలో, హార్‌మెగిద్దోన్‌ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో, యేసు ఆయన సైన్యం సాతాను దుష్ట లోకాన్ని ఓడిస్తారు. చివరి దర్శనంలో యోహాను పరలోకంలో, భూమ్మీద గొప్ప శాంతి ఉన్నట్లు చూస్తాడు. సాతాను, అతని అనుచరులు పూర్తిగా నాశనం అయిపోయారు. పరలోకంలో, భూమ్మీద ఉన్న ప్రతి ఒక్కరూ యెహోవా పేరును గౌరవిస్తూ ఆయనను మాత్రమే ఆరాధిస్తారు.

“నేను నీకూ స్త్రీకీ, నీ సంతానానికీ ఆమె సంతానానికీ మధ్య శత్రుత్వం పెడతాను. ఆయన నీ తలను చితగ్గొడతాడు, నువ్వు ఆయన మడిమె మీద కొడతావు.”—ఆదికాండం 3:15

ప్రశ్నలు: యోహాను ఎన్ని దర్శనాలు చూశాడు? హార్‌మెగిద్దోన్‌ యుద్ధంలో యేసు ఏం చేస్తాడు?

ప్రకటన 1:1-3; 4:1-11; 7:4, 9-17; 11:15-18; 12:5-12; 14:6, 7; 16:14, 16; 21:5

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి