కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • jy అధ్యా. 92 పేజీ 216-పేజీ 217 పేరా 7
  • పదిమంది కుష్ఠురోగుల్లో ఒక్కరే కృతజ్ఞత చూపించారు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పదిమంది కుష్ఠురోగుల్లో ఒక్కరే కృతజ్ఞత చూపించారు
  • యేసే మార్గం, సత్యం, జీవం
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెరూషలేముకు యేసుచేసిన చివరి పర్యటనలో పదిమంది కుష్ఠరోగులు స్వస్థతనొందుట
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
  • మీరు మర్చిపోకుండా థ్యాంక్స్‌ చెప్తారా?
    గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
  • యేసు ఎన్నో అద్భుతాలు చేశాడు
    నా బైబిలు పుస్తకం
  • ఈ ‘శుభవర్తమానముగల దినాన’ ఏదీ మిమ్మల్ని ఆటంకపరచనివ్వకండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
మరిన్ని
యేసే మార్గం, సత్యం, జీవం
jy అధ్యా. 92 పేజీ 216-పేజీ 217 పేరా 7
యేసు బాగుచేసిన పదిమంది కుష్ఠురోగుల్లో ఒకతను, ఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికి తిరిగొచ్చాడు

92వ అధ్యాయం

పదిమంది కుష్ఠురోగుల్లో ఒక్కరే కృతజ్ఞత చూపించారు

లూకా 17:11-19

  • యేసు పదిమంది కుష్ఠురోగుల్ని బాగుచేశాడు

మహాసభ తనను చంపాలని చూస్తోంది కాబట్టి, యేసు ఎఫ్రాయిము అనే నగరానికి వెళ్లిపోయాడు. అది యెరూషలేముకు కాస్త ఈశాన్యంలో ఉంది. అక్కడ ఆయన తన శత్రువులకు దూరంగా శిష్యులతో ఉన్నాడు. (యోహాను 11:54) సా.శ. 33 పస్కా పండుగ దగ్గరపడుతోంది కాబట్టి యేసు త్వరలోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఆయన ఉత్తరం వైపుగా ప్రయాణిస్తూ సమరయ గుండా గలిలయ చేరుకున్నాడు. ఆయన చనిపోకముందు అక్కడికి వెళ్లడం అదే చివరిసారి.

యేసు తన ప్రయాణం ఆరంభంలో, ఒక గ్రామం నుండి మరో గ్రామానికి వెళ్తునప్పుడు, పదిమంది కుష్ఠురోగులు ఆయనకు ఎదురయ్యారు. కొన్ని రకాల కుష్ఠువ్యాధులు క్రమక్రమంగా శరీర భాగాల్ని అంటే చేతివేళ్లను, కాలివేళ్లను, లేదా చెవులను తినేస్తాయి. (సంఖ్యాకాండం 12:10-12) ధర్మశాస్త్రం ప్రకారం కుష్ఠురోగి అందరికి దూరంగా జీవించాలి, “అపవిత్రుణ్ణి! అపవిత్రుణ్ణి!” అని అరవాలి.—లేవీయకాండం 13:45, 46.

కాబట్టి ఆ పదిమంది కుష్ఠురోగులు దూరంగా నిలబడి, “యేసూ, బోధకుడా, మమ్మల్ని కరుణించు!” అని కేకలు వేశారు. అప్పుడు యేసు వాళ్లను చూసి, “వెళ్లి యాజకులకు కనిపించండి” అన్నాడు. (లూకా 17:13, 14) అలా చెప్పడం ద్వారా ఆయన ధర్మశాస్త్రం పట్ల గౌరవం చూపించాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారం కుష్ఠురోగులు ఎవరైనా బాగైతే, వాళ్లు బాగయ్యారని యాజకులు మాత్రమే ప్రకటించాలి. అప్పుడు వాళ్లు మళ్లీ ప్రజల మధ్య జీవించవచ్చు.—లేవీయకాండం 13:9-17.

పదిమంది కుష్ఠురోగులు యేసుకు ఎదురుపడ్డారు

యేసు తమను అద్భుతరీతిగా బాగుచేయగలడని ఆ పదిమంది కుష్ఠురోగులు నమ్మారు. ఇంకా బాగవ్వకముందే, వాళ్లు యేసు మీద విశ్వాసంతో యాజకుల దగ్గరికి బయల్దేరారు. వాళ్లు దారిలో ఉండగానే తమ విశ్వాసానికి తగిన ప్రతిఫలం పొందారు. తాము బాగయ్యామని వాళ్లకు అర్థమైంది!

బాగైన కుష్ఠురోగుల్లో తొమ్మిదిమందేమో యాజకుల దగ్గరికి వెళ్లారు, సమరయుడైన ఒక్క వ్యక్తి మాత్రం యేసును వెతుక్కుంటూ తిరిగొచ్చాడు. ఎందుకు? తనను బాగుచేసిన యేసు పట్ల అపారమైన కృతజ్ఞతతో అతను తిరిగొచ్చాడు. తాను దేవుని శక్తివల్లే బాగయ్యానని గ్రహించి, అతను “దేవుణ్ణి బిగ్గరగా” మహిమపర్చాడు. (లూకా 17:15) యేసు కనబడగానే అతను సాష్టాంగపడి ఆయనకు కృతజ్ఞతలు చెప్పాడు.

తన చుట్టూ ఉన్నవాళ్లతో యేసు ఇలా అన్నాడు: “పదిమందీ శుద్ధులయ్యారు కదా? మరి మిగతా తొమ్మిదిమంది ఎక్కడ? అన్యజనుడైన ఇతను తప్ప దేవుణ్ణి మహిమపర్చడానికి ఇంకెవ్వరూ తిరిగి రాలేదా?” తర్వాత ఆయన సమరయునితో ఇలా అన్నాడు: “లేచి నీ దారిన వెళ్లు, నీ విశ్వాసం నిన్ను బాగుచేసింది.”—లూకా 17:17-19.

యేసు పదిమంది కుష్ఠురోగుల్ని బాగుచేయడం ద్వారా తనకు యెహోవా దేవుని సహాయం ఉందని చూపించాడు. ఆ పదిమందిలో ఒకతనికి మాత్రం జీవమార్గంలో ప్రవేశించే అవకాశం కూడా దొరికి ఉంటుంది. అయితే మన కాలంలో దేవుడు అలాంటి స్వస్థతలు చేయట్లేదు. కానీ మనం యేసుమీద విశ్వాసం ఉంచితే జీవమార్గంలో ప్రవేశించగలుగుతాం, అంటే శాశ్వత జీవితం పొందగలుగుతాం. మరి, ఆ సమరయునిలాగే మనం కూడా కృతజ్ఞత చూపిస్తున్నామా?

  • తనను చంపాలని చూస్తున్నవాళ్లకు దూరంగా యేసు ఎక్కడికి వెళ్లాడు?

  • పదిమంది కుష్ఠురోగులు ఎందుకు దూరంగా నిలబడ్డారు? యాజకుల దగ్గరికి వెళ్లమని యేసు వాళ్లకు ఎందుకు చెప్పాడు?

  • సమరయుని నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి