అధస్సూచి
a టాసిటస్ క్రీస్తు శకం 55వ సంవత్సరంలో పుట్టి ఉంటాడు. ఆయన ఇలా రాశాడు, “క్రైస్తవులకు ఆ పేరు, క్రిస్తుస్ అనే అతని నుండి వచ్చింది. అతను తిబెరి ఏలుబడిలో అధిపతిగా ఉన్న పొంతి పిలాతు చేతుల్లో దారుణమైన శిక్షను అనుభవించాడు.” యేసు గురించి మొదటి శతాబ్దానికి చెందిన స్యుటోనియస్, అదే శతాబ్దానికి చెందిన యూదా చరిత్రకారుడు జోసిఫస్, రెండవ శతాబ్దం మొదట్లో బితూనియ అధికారి అయిన ప్లైని ద యంగర్ కూడా రాశారు.