అధస్సూచి
a ప్రాచీన ఇశ్రాయేలు రాజైన దావీదు భూసంబంధ సీయోను పర్వత కోటను యెబూసీయుల నుండి స్వాధీనం చేసుకొని దాన్ని తన రాజధానిగా చేసుకున్నాడు. (2 సమూయేలు 5:6, 7, 9) ఆయన పరిశుద్ధ మందసాన్ని కూడా ఆ ప్రదేశానికి మార్చాడు. (2 సమూయేలు 6:17) మందసం యెహోవా ప్రత్యక్షతతో జతచేయబడింది కాబట్టి, సీయోను పర్వతం దేవుని నివాసస్థలంగా పేర్కొనబడింది, అలా అది పరలోకానికి సరైన చిహ్నంగా ఉంది.—నిర్గమకాండము 25:22; లేవీయకాండము 16:2; కీర్తన 9:11; ప్రకటన 11:19.