మన క్రైస్తవ జీవితం
యెహోవా తన ప్రజల్ని కాపాడతాడు
మొదటి పస్కా, చాలా ప్రాముఖ్యమైన ఒక సంఘటన. ఆ రోజు రాత్రి తన మొదటి సంతానం చనిపోయిందని ఫరో తెలుసుకున్నప్పుడు మోషేతో ఇలా అన్నాడు: “లెండి, మీరూ మిగతా ఇశ్రాయేలీయులూ నా ప్రజల మధ్య నుండి వెళ్లిపోండి. మీరు అడిగినట్టే వెళ్లి యెహోవాను సేవించండి.” (నిర్గ 12:31) తన ప్రజల్ని కాపాడతానని యెహోవా అప్పుడు రుజువు చేశాడు.
యెహోవా తన ప్రజల్ని ఇంకా నిర్దేశిస్తూ, కాపాడుతూ ఉన్నాడని వాళ్ల ఆధునికకాల చరిత్ర స్పష్టం చేస్తుంది. ఆ విషయాన్నే ప్రపంచ ప్రధాన కార్యాలయంలోని “యెహోవా పేరు కోసం ఎంచుకోబడిన ప్రజలు” అనే అంశం ఉన్న మ్యూజియంలో చూడవచ్చు.
వార్విక్ మ్యూజియం టూర్లు: “యెహోవా పేరు కోసం ఎంచుకోబడిన ప్రజలు” వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:
బైబిలు మీద విశ్వాసం పెంచడానికి బైబిలు విద్యార్థులు 1914 మొదలుకొని ఏ కొత్త పరికరాన్ని ఉపయోగించారు? దానివల్ల ఎలాంటి మంచి ఫలితాలు వచ్చాయి?
1916 లో అలాగే 1918 లో ఏ పరీక్షలు వచ్చాయి? యెహోవా తన సంస్థను నిర్దేశిస్తున్నాడు అనడానికి ఎలాంటి రుజువులు కనిపించాయి?
వ్యతిరేకత వచ్చినా యెహోవా ప్రజలు తమ విశ్వాసంలో ఎలా స్థిరంగా నిలబడ్డారు?
1935 లో యెహోవా ప్రజలు ఏ కొత్త అవగాహన పొందారు? అది వాళ్ల మీద ఎలాంటి ప్రభావం చూపించింది?
ఈ వీడియోలో చూసిన ఏ విషయాన్ని బట్టి యెహోవా తన ప్రజల్ని నిర్దేశిస్తున్నాడనే, కాపాడుతున్నాడనే మీ నమ్మకం బలపడింది?