దైవ పరిపాలనా వార్తలు
◆ ఆస్ట్రేలియా మార్చినెలలో 54,306 మంది ప్రచారకులను శిఖరాగ్ర సంఖ్యలో నివేదించినది, ఇది వారి వరుసగా మూడవసారి పెరిగిన సంఖ్య.
◆ బొలివియాలో ఈ సేవా సంవత్సరములోని మొదటి ఏడు నెలలలో ఐదుసార్లు వరుసగా ప్రచారకులు శిఖరాగ్ర సంఖ్యకు చేరుకొనిరి. దీనిలో మార్చినందు అత్యధికముగా అంటే 8,031 మంది రిపోర్టు చేసిరి. సంఘ ప్రచారకులు పరిచర్యలో సగటున 14.4 గంటలను కలిగియుండిరి. జ్ఞాపకార్థ దినమునకు ప్రచారకులు సంఖ్యకు నాలుగురెట్లమంది హాజరైరి, వారి హాజరు 33,377.
◆ నిషేధములున్న తొమ్మిది సంవత్సరముల తర్వాత, నికరాగువలో మే 1, 1991 నుండి బ్రాంచి కార్యాలయము మరలా పనిచేయుటను ఆరంభించినది. ఇంతకుముందు నికరాగువలో పనిచేయుటకు నియమించబడిన ఐదుగురు మిషనరీలు తమ మిషనరీ సేవను కొనసాగించుటకు తిరిగి అక్కడికి చేరుకొనగలిగిరి.