కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w15 4/1 పేజీ 16
  • మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రభువు రాత్రి భోజనం ఎలా ఆచరించబడింది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • ‘నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • పరలోకంలో ఉన్నవాటిని, భూమ్మీద ఉన్నవాటిని సమకూర్చడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • యెహోవాను, ఆయన కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి
    గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
w15 4/1 పేజీ 16

మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

యేసు మరణాన్ని మనమెందుకు జ్ఞాపకం చేసుకోవాలి?

పరదైసు లేదా అందమైన తోటలా మారిన భూమిపై సంతోషంగా జీవిస్తున్న ప్రజలు

యేసు చేసిన ప్రాణ త్యాగం వల్ల భవిష్యత్తు ఎలా ఉంటుంది?—యెషయా 25:8; 33:24

చరిత్రలో యేసు మరణం చాలా ముఖ్యమైనది. మనుషులు పోగొట్టుకున్న జీవితాన్ని తిరిగి తీసుకురావడానికి ఆయన చనిపోయాడు. మొదట్లో మనుషుల్లో చెడు స్వభావం లేదు, జబ్బులు లేవు, చావు లేదు. (ఆదికాండము 1:31) అయితే, మొదటి మానవుడైన ఆదాము నుండి మనుషులందరికీ పాపం వచ్చింది. పాపం, మరణం నుండి మనల్ని కాపాడడానికి యేసు తన ప్రాణం ఇచ్చాడు.—మత్తయి 20:28; రోమీయులు 6:23 చదవండి.

మన కోసం చనిపోవడానికి తన కుమారున్ని ఈ భూమ్మీదకు పంపించి దేవుడు చాలా గొప్ప ప్రేమను చూపించాడు. (1 యోహాను 4:9, 10) రొట్టె, ద్రాక్షారసం ఉన్న ఆచారంతో తన మరణాన్ని జ్ఞాపకం చేసుకోమని యేసు తన అనుచరులకు చెప్పాడు. మనం ప్రతీ సంవత్సరం ఈ ఆచారాన్ని పాటించి దేవుని పట్ల, యేసు పట్ల కృతజ్ఞతను చూపించవచ్చు.—లూకా 22:19, 20 చదవండి.

రొట్టె, ద్రాక్షారసం ఎవరు తీసుకుంటారు?

తన మరణాన్ని జ్ఞాపకం చేసుకోమని యేసు తన శిష్యులకు చెప్పినప్పుడు ఒక నిబంధన లేదా ఒప్పందం గురించి మాట్లాడాడు. (మత్తయి 26:26-28) ఈ ఒప్పందం వల్ల ఆ శిష్యులకు, ఇంకొందరికి యేసుతో పాటు పరలోకంలో రాజులు, యాజకులు అయ్యే అవకాశం దొరికింది. యేసు మరణాన్ని లక్షలమంది జ్ఞాపకం చేసుకుంటారు కానీ, ఎవరైతే ఈ ఒప్పందంలో ఉన్నారో వాళ్లు మాత్రమే రొట్టె, ద్రాక్షారసం తీసుకుంటారు.—ప్రకటన 5:9, 10 చదవండి.

సుమారు 2000 సంవత్సరాల నుండి రాజులయ్యే వాళ్లను యెహోవా ఎన్నుకుంటున్నాడు. (లూకా 12:32) భూమ్మీద నిత్యం జీవించే వాళ్లతో పోలిస్తే రాజులయ్యే వాళ్లు తక్కువమంది మాత్రమే ఉంటారు.—ప్రకటన 7:4, 9, 17 చదవండి. (w15-E 03/01)

ఇంకా తెలుసుకోవడానికి, యెహోవాసాక్షులు ప్రచురించిన ఈ పుస్తకంలో 5వ అధ్యాయం చూడండి

www.jw.org/te వెబ్‌సైట్‌లో కూడా ఈ పుస్తకం ఉంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి