“వారు రాజీపడలేదు”
“నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు” అని యేసు తన శిష్యులకు చెప్పాడు. (మత్తయి 5:11) నేడు యెహోవాసాక్షులు ధన్యులుగా ఉండడానికి లేదా సంతోషంగా ఉండడానికి కారణం వారు క్రీస్తు బోధకు, మాదిరికి అనుగుణంగా అన్ని రకాల పరిస్థితుల్లో “లోకసంబంధులు”గా ఉండరు, రాజకీయ తటస్థతను ఖచ్చితంగా కాపాడుకుంటారు, దేవునిపట్ల యథార్థంగా ఉంటారు.—యోహాను 17:14; మత్తయి 4:8-10.
ఇస్టోనియాతోపాటు మునుపటి సోవియట్ యూనియన్లో యెహోవాసాక్షులు కనబరచిన రాజీపడని వైఖరిని గురించి లూథరన్ వేదాంతి, బైబిలు అనువాదకుడైన టూమస్ పాల్ కిరిక్ కెసెట్ కూల (పల్లె మధ్యలో ఉన్న చర్చి) అనే తన పుస్తకంలో ఇలా వ్రాశాడు: “ఏప్రిల్ 1, 1951 తెల్లవారుజామున జరిగిన ఘటనల గురించి చాలా కొద్దిమందే విన్నారు. యెహోవాసాక్షులను, వారితో సహవసిస్తున్నవారిని తుడిచివేసే ఒక కార్యక్రమం గురించి పథకం వేయబడింది, యెహోవాసాక్షుల్లో మొత్తం 279 మందినీ పట్టుకొని వారిని దేశం నుండి బహిష్కరించి సైబీరియాకు పంపించారు . . . దేశ బహిష్కారాన్ని లేక నిర్భందాన్ని తప్పించుకోవడానికి వారు తమ విశ్వాసాన్ని వదులుకుంటున్నట్లు ఒక సాధారణ ఫారం మీద సంతకం చేసే అవకాశం వారికి ఇవ్వబడింది . . . ఇంతకుముందు అరెస్టు అయిన వారితో కలిసి 353 మంది నిర్భందించబడ్డారు, వారిలో దాదాపు 171 మంది కేవలం వారి సంఘాలతో సహవసిస్తున్నవారు ఉన్నారు. వారు సైబీరియాలో కూడా రాజీపడలేదు . . . యెహోవాసాక్షులు చూపించినటువంటి విశ్వాసాన్ని [ఇస్టోనియన్ లూథరన్] చర్చికి చెందినవారిలో చాలా తక్కువమంది చూపించారు.”
ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు శ్రమలు ఎదురైనా దేవునికి నమ్మకంగా, విధేయులుగా ఉండేందుకు దేవుడే తమకు సహాయం చేస్తాడనే నమ్మకంతో ఉన్నారు. తమ నమ్మకం కారణంగా లభించే ప్రతిఫలం అధికంగా ఉంటుందని తెలుసుకొని వారు ఆనందిస్తారు.—మత్తయి 5:12.