6వ సెక్షన్కు పరిచయం
చివరికి ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశానికి చేరుకున్నాక అక్కడ గుడారం నిజమైన ఆరాధనకు కేంద్రం అయ్యింది. యాజకులు ధర్మశాస్త్రాన్ని బోధించారు, న్యాయాధిపతులు దేశాన్ని నడిపించారు. ఈ సెక్షన్లో మన నిర్ణయాలు, మన పనులు వేరేవాళ్ల మీద ఎంత ప్రభావం చూపించవచ్చో తెలుస్తుంది. ప్రతి ఇశ్రాయేలీయుడు యెహోవాకు, తన సాటిమనిషికి నమ్మకంగా ఉండాలి. దెబోరా, నయోమి, యెహోషువ, హన్నా, యెఫ్తా కూతురు, సమూయేలు వాళ్ల చుట్టుప్రక్కల ఉన్న వాళ్లపై ఎలాంటి ప్రభావం చూపించారో మీ పిల్లలకు ముఖ్యంగా చెప్పండి. అంతేకాకుండా దేవుడు ఇశ్రాయేలీయులతో ఉన్నాడు అని తెలుసుకుని కొంతమంది ఇశ్రాయేలీయులు కానీ వాళ్లు అంటే రాహాబు, రూతు, యాయేలు, గిబియోనీయులు ఇశ్రాయేలీయుల వైపు ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం మీ పిల్లలకు గుర్తుండిపోయేలా చెప్పండి.