2వ సెక్షన్కు పరిచయం
అప్పుడున్న లోకాన్ని నాశనం చేయడానికి యెహోవా జలప్రళయాన్ని ఎందుకు తెచ్చాడు? మనుషుల చరిత్ర మొదట్లోనే ఒక యుద్ధం మొదలైంది—చెడుకు మంచికి మధ్య యుద్ధం. ఆదాము, హవ్వ, వాళ్ల కొడుకు కయీను చెడు వైపు ఉండాలని నిర్ణయించుకున్నారు. హేబెలు, నోవహు లాంటి ఇంకొంతమంది మంచి వైపు ఉండాలని నిర్ణయించుకున్నారు. కానీ చాలామంది బాగా చెడిపోయారు. అందుకే యెహోవా ఆ చెడ్డ లోకాన్ని అంతం చేశాడు. మనం ఎటు వైపు ఉండాలని నిర్ణయించుకుంటామో యెహోవా చూస్తాడని, ఆయన ఎప్పుడూ చెడుని మంచిపై గెలవనివ్వడని నేర్చుకోవడానికి ఈ సెక్షన్ మనకు సహాయం చేస్తుంది.